• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    AAA Cinemas: అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు తెలుసా?
    Hyderabad: శంషాబాద్ వద్ద తొలి ‘డ్రైవ్ ఇన్ థియేటర్’.. పార్ట్‌నర్స్‌గా రానా, మహేశ్, వెంకటేష్
    Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవోగా మరో భారతీయుడు… నీల్ మోహన్ నేపథ్యంపై స్పెషల్ స్టోరీ
    See More

    Neuralink: అద్భుతం… మనిషి మెడదులో అమర్చిన చిప్ పనిచేస్తోంది..! ఎలాగంటే?

    మనిషి మెదడులో చిప్ అమర్చిన న్యూరాలింక్‌ ప్రాజెక్ట్ విజయవంతమైనట్లు స్పెస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్ తెలిపారు. ఆ చిప్ కలిగిన మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. అతని ఆలోచనల ప్రకారం కంప్యూటర్ మౌస్‌ను కంట్రోల్ చేయగల్గినట్లు వెల్లడించారు. గతేడాది సెప్టెంబరులో మానవులపై క్లీనికల్ ట్రయల్స్ కోసం ఆయన ఆమోదం సాధించారు. USFDA ఆమోదం తర్వాత మనిషి మెదడులో చిప్‌ను అతని స్టార్టప్ విజయవంతంగా అమర్చింది. ప్రయోగం చేయదల్చుకున్న వాలంటీర్‌ మెదడులోని భాగానికి ఆపరేషన్ చేసి చిప్‌ను అమర్చారు. అయితే మనిషి మెదడులో … Read more

    Hyderabad Street Food Centers: కుమారి ఆంటీ కంటే చీప్‌కే అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. ఓ లుక్కేయండి!

    హైదరాబాద్‌లో కుమారి ఆంటీ స్ట్రీట్‌ ఫుడ్స్‌ (Kumari Aunty Street Food) ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆమె దగ్గర తక్కువ ధరకే రుచికరమైన ఫుడ్‌ దొరుకుతుండటంతో భారీ సంఖ్యలో ఫుడ్ లవర్స్‌ ఆమె వద్దకు క్యూ కట్టారు. అటు యూట్యూబ్‌ ఛానెల్స్‌ సైతం ఆమెపై ఫోకస్‌ పెట్టడంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. అయితే నగరంలో కుమారి ఆంటీ తరహాలోనే చాలా స్ట్రీట్‌ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. అద్భుతమైన రుచితో తక్కువ ధరకే నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తున్నాయి. … Read more

    Interim Budget 2024: వస్తువుల ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!

    ఏప్రిల్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా పూర్తి బడ్జెట్‌ను కాకుండా తాత్కాలిక బడ్టెట్‌ (Union Budget 2024)ను ఆమె ప్రకటించారు. 2024-25 నాటికి బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. వీటిలో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు కాగా.. పన్ను వసూళ్లు రూ. 26.02 లక్షల కోట్లు ఉంటాయని నిర్మల అన్నారు. అయితే … Read more

    Sanjay Shah: విస్టెక్స్‌ వ్యవస్థాపకుడు సంజయ్‌ షా దుర్మరణం.. ఎలా జరిగిందంటే?

    విస్టెక్స్‌ (Vistex) వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్‌షా (Sanjay Shah) దుర్మరణం చెందారు. సంస్థ ఉద్యోగులతో కలిసి కంపెనీ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని హైదరాబాద్‌ వచ్చిన ఆయన సంబురాలు చేసుకుంటుండగానే మృతిచెందారు. నగర శివార్లలోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో విస్టెక్స్‌ సంస్థ ప్రెసిడెంట్‌ విశ్వనాథ్‌రాజ్‌ కూడా తీవ్ర గాయాలపాలై మృత్యువుతో పోరాడుతున్నారు.  ముంబైకి చెందిన సంజయ్‌షా 25 ఏళ్ల కిందట విస్టెక్స్‌ ఏషియా (Vistex Asia) కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ అంచెలంచెలుగా దేశవిదేశాలకు విస్తరించింది. … Read more

    స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 36 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 19,816 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను లాభాల బాట పట్టించాయి. ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటలకు సెన్సెక్స్‌ 151 పాయింట్ల లాభంతో 66,174 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 19,858 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు ఉండడంతో మార్కెట్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. .

    నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 115 పాయింట్ల నష్టంతో 65,560 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 19,640 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు వీటిపై ప్రభావం చూపుతున్నాయి. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీలు నష్టాల్లో ట్రెడవుతున్నాయి.

    నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 188 పాయింట్ల నష్టంతో 64,643 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 19,348 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఒక్క టాటా మోటార్స్‌ తప్ప మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

    స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 65,101.95 దగ్గర స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. 64,851.06 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 33.21 పాయింట్ల స్వల్ప లాభంతో 64,975.61 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,449.60 దగ్గర ప్రారంభమై చివరకు 36.80 పాయింట్లు లాభపడి 19,443.50 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్ద నిలిచింది.

    నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 176 పాయింట్ల నష్టంతో 64,781 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు తగ్గి 19,363 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్ల నష్టానికి దారితీశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.